Friday, May 3, 2024

హార్ట్ ఎటాక్ తో – క‌న్న‌డ స్టార్ పునీత్ అభిమాని మృతి

రీసెంట్ గా పునీత్ రాజ్ కుమార్ న‌టించిన ఆఖ‌రి చిత్రం జేమ్స్ . పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రిలీజ్ అయింది. పునిత్ రాజ్ కుమార్ కు ఘనంగా నివాళి అర్పించాలని…కన్నడ నాట అన్ని థియేటర్లలో వారానికి పైగా జేమ్స్ మూవీని నడిపించేలా ప్లాన్ చేశారట. ఇక జేమ్స్ మూవీ రిలీజ్ సంబరాల్లో అభిమానులు హడావిడి చేస్తున్నారు. ఈ సంబరాల్లో దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. పునీత్‌ నటించిన చివరి చిత్రం జేమ్స్‌ సినిమా విడుదల సందర్భంగా మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హెడియాల గ్రామంలో గురువారం జరిగిన సంబరాల్లో ఓ అభిమానికి గుండె పోటు వచ్చింది. హెడియాల గ్రామ పంచాయతీ అధ్యక్షులు మంజులా కుమారుడు 22 ఏళ్ళ ఆకాశ్‌ జేమ్స్ రిలీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఈక్రమంలో ఆకాశ్‌ కు గుండెపోటు రావడంతో హాస్పిటల్ కు తరలించే లోపే మరణించాడు. ఈ సంఘటన పునిత్ రాజ్ కుమార్ అభిమాన సంఘాలలో విషాదాన్ని నింపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement