Friday, May 3, 2024

విశాఖ‌ ఉక్కు ఉద్య‌మానికి ఏడాది – ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడుకుంటాం – నారా లోకేశ్

విశాఖ ఉక్కు కార్మికుల‌కు, ఉద్య‌మాభివంద‌నాలు తెలిపారు టిడిపి నేత నారా లోకేశ్. విశాఖ ఉక్కు క‌ర్మాగారం అమ్మ‌కానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మం ప్రారంభ‌మై నేటికి ఏడాది అయింది. పోరాటానికి ఏడాది గ‌డుస్తోన్న నేప‌థ్యంలో దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ… . ఈ విష‌యంపై పార్ల‌మెంటు వ‌ర‌కు త‌మ పార్టీ నిర‌స‌న గ‌ళం వినిపిస్తూనే ఉంద‌ని తెలిపారు. విశాఖ ఉక్కుపై వైసీపీ ఎంపీలు మాట్లాడ‌ట్లేదని ఆయ‌న ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని కుట్ర‌లు చేసినా ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడుకుంటామ‌ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకూ, పోరాటం ఆపేది లేద‌ని ప్ర‌క‌టించిన కార్మికులు అదే స్ఫూర్తితో నేటికీ పోరాటాన్ని కొన‌సాగిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement