Saturday, May 11, 2024

వైరా రిజ‌ర్వాయ‌ర్ లో – మంత్రుల బోటింగ్ షికార్లు

ఖమ్మం బ్యూరో : జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలకు వచ్చిన మంత్రులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , టూరిజం పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస గౌడ్ వైరా రిజర్వాయర్ లో బోటింగ్ ప్రారంభించి షికార్లు చేశారు. జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్సీ మధుసూదన్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మంత్రుల వెంట షికార్లు చేశారు. తొలుత వైరా నియోజకవర్గ కేంద్రంలో జిల్లా యువజన క్రీడల శాఖ-ఖమ్మం, తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటి అధ్వర్యంలో రూ.89 లక్షలతో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియంను వారు ప్రారంభించారు. వైరా రిజర్వాయర్ నందు తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ అద్వర్యంలో రూ.13 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 6-సీట్ల సామర్ధ్యం కలిగిన రెండు స్పీడ్ బోట్స్ ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement