Friday, April 26, 2024

తౌతే తుపాను అలర్ట్: కేరళలో భారీ వర్షాలు, ఈదురు గాలులు

ఓవైపు క‌రోనాతో దేశం అత‌లాకుత‌లం అవుతోన్న వేళ‌.. ఇప్పుడు తౌతే తుపాను ముంచుకొస్తుంది. ఈ తుపాను ప్ర‌స్తుతం కేర‌ళ‌ను షేక్ చేస్తోంది. అతి భారీ వ‌ర్షాల‌కు తోడుగా అత్యంత వేగంతో వీస్తున్న ఈదురు గాలులు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ శాఖ ఇప్ప‌టికే ‘రెడ్ అలెర్ట్’ ప్ర‌క‌టించింది. తీర ప్రాంతాల్లో జ‌న‌జీవ‌నం పూర్తిగా స్థంభించిపోయింది.
కేర‌ళ‌లోని మ‌ల్లాపురం, కోజికోడ్‌, వ‌య‌నాడ్, పాల‌క్కాడ్‌తో పాటు ప‌లు జిల్లాల్లో తుపాను ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. భారీ వ‌ర్షాల కార‌ణంగా వంద‌లాది ఇళ్లు దెబ్బ‌తిన్నాయి. ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. ఇక తీర‌ప్రాంతాల్లో స‌ముద్రం ముందుకొచ్చింది. కొన్ని న‌దుల్లో నీటి మ‌ట్టం పెర‌గ‌డంతో ఆన‌క‌ట్ట‌ల‌ గేట్ల‌ను ఎత్తివేశారు. కాసర్‌గోడ్‌ జిల్లాలోని చేరంగాయ్‌లో తుపాను దాటికి ఓ భవనం కుప్పకూలింది. అయితే, అందులో నివసించే కుటుంబాలను ముందుగానే ఖాళీ చేయించడంతో పెను ముప్పు తప్పింది.

తీవ్ర రూపం దాల్చిన తౌతే తుపాను గుజరాత్ వైపు పయనిస్తున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది అత్యంత తీవ్రమైన తుపానుగా మారి మంగళవారం మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య గుజరాత్‌లోని పోర్‌బందర్-నలియాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ సమయంలో గంటలకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement