Saturday, May 4, 2024

TS: చేపల వేటకు వెళ్లి, యువకుడు గల్లంతు.. రెస్క్యూ చేపట్టిన పోలీసులు

మరిపెడ, (ప్రభ న్యూస్): చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతైన ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మరిపెడ మండలం పురుషోత్తమయగూడెం పరిధిలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సిరోల్ మండలం కందికొండ గ్రామానికి చెందిన షేక్ మీరా తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో చేపల వేట కోసం దోస్తులతో కలిసి మండలంలోని పురుషోత్తమయగూడెం శివారులోని దామెర చెరువు మత్తడి వద్దకు వెళ్లారు. చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారీ నీటి ప్రవాహంలో పడిపోయాడు.

ఆ సమయంలో చేతిలో ఉన్న వల కాళ్లకు చుట్టుకోవడంతో ఎటూ కదలలేక నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న మరిపెడ ఎస్సై ప్రవన్ కుమార్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ నిర్వహిస్తున్నారు. ప్రవాహం అధికంగా ఉండటం, చీకటి పడుతుండడంతో యువకుడి జాడ కనిపెట్టడం ఇబ్బందిగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కండికొండ గ్రామస్తులు, బంధువులు మత్తడి వద్దకు చేరుకుని విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement