Saturday, May 18, 2024

బిజెపి నేత‌ని న‌రికి చంపిన‌.. మావోయిస్టులు

ఓ బిజెపి నేత‌ను ఇంట్లో నుండి బ‌య‌టికి లాక్కొచ్చి మ‌రీ న‌రికి చంపారు మావోయిస్టులు.ఈ దారుణం బీజాపూర్ లో చోటు చేసుకుంది. ఈ దారుణం బిజెపి నేత కుటుంబ సభ్యుల క‌ళ్ల‌ ఎదుటే జ‌రిగింది. బీజాపూర్ లోని ఉసూర్ బ్లాక్ బీజేపీ ప్రెసిడెంట్ గా 15 ఏళ్లుగా నీలకంఠ్ కక్కెమ్ పనిచేస్తున్నారు. తన పూర్వీకుల గ్రామమైన పైక్రమ్ లో పెళ్లికి హాజరయ్యేందుకు ఆయన వెళ్లారు. అక్కడికి వచ్చిన నిషేధిత సీపీఐ(ఎం)కు చెందిన మవోయిస్టులు.. గొడ్డళ్లు, ఇతర పదునైన ఆయుధాలతో నీలకంఠ్ పై దాడి చేశారు. దీంతో అక్కడికక్కడే ఆయన చనిపోయారు అని ఏసీపీ చంద్రకాంత్ గవర్న చెప్పారు. ఆవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పైక్రమ్ లో మావోయిస్టులు ఒకరిని చంపారని తమకు సమాచారం అందిందని, వెంటనే అక్కడికి చేరుకున్నామని ఏసీపీ చంద్రకాంత్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. దాడి చేసేందుకు దాదాపు 150 మంది మావోయిస్టులు వచ్చినట్లు తెలిసిందన్నారు. అందరూ సాధారణ దుస్తుల్లోనే వచ్చారని, ముగ్గురు మాత్రమే బీజేపీ నేత ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement