Saturday, May 11, 2024

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. సిట్ కు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన‌ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఏసీబీ కోర్టు సిట్ అధికారులకు షాకిచ్చింది. సిట్ దాఖలు చేసిన మెమోపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయస్థానం దానిని తిరస్కరించింది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామితో పాటు శ్రీనివాస్ పేర్లను సిట్ నిందితుల జాబితాలో చేర్చింది. వీరందరి పేర్లను నిందితులుగా చేర్చుతూ సిట్ దాఖలు చేసిన మెమోను ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement