Thursday, April 25, 2024

Telangana | దేశానికే తెలంగాణ రోల్​మోడల్​.. సిరిసిల్ల జిల్లాలో కేజీ టు పీజీ క్యాంపస్​ రెడీ!

విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్​ మోడల్​గా నిలవబోతోంది. యావత్​ దేశమే  గర్వంగా చెప్పుకునేలా రాష్ట్రంలో మొదటి కేజీ టు పీజీ విద్యాసంస్థను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కిండర్ గార్టెన్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌ను నిర్మించింది. అందరికీ ఉచిత విద్యను అందించాలనే కాన్సెఫ్ట్​తో సీఎం కేసీఆర్​ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట తొలి వేదిక కాబోతోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆరు ఎకరాల క్యాంపస్ 100,00 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మోడల్​ క్యాంపస్​ నిర్మించారు. ఇక్కడ 3,500 మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పేలా అన్ని రకాల వసతులను కల్పించారు. ఈ మోడల్ క్యాంపస్‌లో అంగన్‌వాడీ కేంద్రం, ప్రి ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్​.. జూనియర్, డిగ్రీ కళాశాలల భవనాలు ఉన్నాయి. ఇక.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘‘మన ఊరు మన బడి’’ కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేటలోని కేజీ టు పీజీ క్యాంపస్ రూపుదిద్దుకుంది. ఈ క్యాంపస్‌లో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో బోధన ఉంటుంది.

250 మందికిపైగా చిన్నారులకు బాల్యంలోనే విద్యనందించేందుకు అధికారులు సౌకర్యాలు కల్పించారు. విశాలమైన క్యాంపస్‌లో డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లతో సహా 90కి పైగా తరగతి గదులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు.

‘తెలంగాణలో మారుతున్న విద్యారంగాన్ని మీకు పరిచయం చేస్తాను’ అని బీఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుండి, కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని ప్రభుత్వం సమ్మిళిత విధానాలు, అత్యాధునిక సౌకర్యాల ద్వారా అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) కేజీ టు పీజీ ఉచిత విద్యా పథకానికి హామీ ఇచ్చింది. అయితే.. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఇప్పుడు కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.

- Advertisement -

అయితే.. కేసీఆర్ ప్రభుత్వం హామీని అమలు చేయడంలో సక్సెస్​ అయ్యిందని.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల కోసం వందలాది రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించిందని సినీ నటుడు ప్రకాశ్​రాజ్​ ఓ ట్వీట్​లో వెల్లడించారు. ఎనిమిదేళ్లుగా విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారని పేర్కొన్నారు. తెలంగాణ తొలి కేజీ టు పీజీ క్యాంపస్‌ను నిర్మించడంపై ట్విట్టర్‌లో స్పందించారు. విజన్ ఉన్న నాయకుడు.. మంచి రేపటి కోసం ఉద్దేశంతో.. ధన్యవాదాలు కేసీఆర్ గారూ’ అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement