Wednesday, May 15, 2024

సీఎం జగన్‌పై నారా లోకేష్ ఫైర్

టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మరోసారి సీఎం జగన్‌పై మండిపడ్డారు. తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్సులు ఆపుతున్న ఘటనపై ఆయన స్పందించారు. ఏపీలో మంచి ఆస్పత్రులు ఉంటే ప్రజలు తెలంగాణ వెళ్లాల్సిన అవసరం ఏముంటుందని అభిప్రాయపడ్డరాు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా వస్తే ఆగమేఘాలపై హైదరాబాద్ ఆస్పత్రుల్లో చేరుతారు కానీ ప్రజలకు మాత్రం ఆ అవకాశం ఇవ్వరా? అని జగన్ సర్కారును లోకేష్ ప్రశ్నించారు. ‘మన రాష్ట్రంలో వైద్యం దొరికితే తెలంగాణకు ఎందుకు వెళ్తారు? ఇంత చేతగాని, దద్దమ్మ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికీ ఉండకూడదు. తాడేపల్లి కొంపలో ఎన్నిగంటలు నిద్రపోతారు? వెంటనే నిద్రలేచి సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి అనుమతులు ఇప్పించండి. తెలంగాణ ప్రభుత్వం అంబులెన్స్‌లను ఆపకుండా ఆదేశాలు ఇవ్వాలి’ అని లోకేష్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement