Saturday, April 27, 2024

త్వరలోనే స్టూడియో కడతా.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కూడా పెడతా

సంచలన వ్యాఖ్యలు ఆసక్తికర కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ టాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. మే డే సందర్భంగా సినీ కార్మిక మహోత్సవంలో పాల్గొన్న ఆయ‌న‌ కరోనా కష్టకాలం పోయిందని వచ్చే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీ మరిన్ని సంచలనాలు నమోదు చేస్తుందన్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ పెట్టి సినిమాలు తీయడంతోపాటు స్టూడియోలు కూడా కడుతానన్నారు మల్లారెడ్డి.

ఇక‌.. ప్రపంచమంతా తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయని సినీ పరిశ్రమకు హైదరాబాద్ బంగారు గని అన్నారు మంత్రి మ‌ల్లారెడ్డి. చిరంజీవి ఆంధ్రా వ్యక్తి కారని సినిమా బిడ్డలంతా తెలంగాణ వాళ్లేనన్నారు. నా లాంటి వాళ్లను భాగస్వాములను చేసి ఓటీటీలు పెట్టుకోవాలని మల్లారెడ్డి ఇండస్ట్రీ పెద్దలను కోరారు. కార్మికుల పక్షాన చిరంజీవి నిలబడాలని, కార్మికులను ధనవంతులను చేసే బాధ్యతను చిరంజీవే తీసుకోవాల‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement