Friday, May 3, 2024

ప్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు ప్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతుండటం మన మార్కెట్లపై కూడా ప్రభావాన్ని చూపింది. అమెరికా ద్రవ్యోల్బణ డేటా విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 35 పాయింట్ల నష్టంతో 58,817కి పడిపోయింది. నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 17,535కి చేరుకుంది. టాటా స్టీల్ 1.91%), భారతి ఎయిర్ టెల్ (1.50%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.45%), ఎల్ అండ్ టీ (1.13%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.09%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్. బజాజ్ ఫైనాన్స్ (-2.66%), ఎన్టీపీసీ (-2.26%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.41%), విప్రో (-1.34%), ఏసియన్ పెయింట్స్ (-1. 23%) టాప్ లూజర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement