Thursday, May 9, 2024

మామను హతమార్చిన అల్లుడు

తెనాలి : పాత కక్షల నేపథ్యంలో తన సొంత చిన్న మామను హత్య చేసిన సంఘటన నందివెలుగు సమీపంలో జరిగింది. రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం కథనం ప్రకారం.. తెనాలి పట్టణ బాలాజీ రావు పేటకు చెందిన షేక్ రబ్బాని కులాంతర వివాహం చేసుకున్నాడు. అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో రబ్బానీ అన్న అల్లుడు నాయబ్ రసూల్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఈ విషయం గురించి తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంద‌ని సిఐ తెలిపారు. కాగా వివాదాలు తనకు వద్దని భావించిన రబ్బాని సామాన్లు సర్దుకుని భార్య పిల్లలతో కలిసి టాటా ఏసీలో విజయవాడ బయలుదేరాడు. విషయం తెలుసుకున్న నాయబ్ రసూల్ నందివెలుగు సమీపంలో దారికాసి రబ్బానిని హత్య చేసినట్లు సిఐ వివరించారు. నిందితుడితో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం ఉందని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement