Friday, April 19, 2024

పార్క్ లో కాల్పులు.. ప‌ది మంది మృతి

పార్క్ లో కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంది.ఈ ఘ‌ట‌న‌లో ప‌దిమంది మృతి చెందారు. అమెరికాలోని కాలిఫోర్నియా న‌గ‌రంలోని మానేట‌రి పార్క్‌లో చైనీయుల న్యూ ఇయ‌ర్ ఈవెంట్ జ‌రిగింది. కాగా మాస్ షూటింగ్‌లో ప‌లువురు మ‌ర‌ణించారు. కాల్పుల ఘ‌ట‌న స‌మాచారంతో మానేట‌రీ పార్క్‌కు చేరుకున్న పోలీసులు స‌హాయ కార్యక్ర‌మాలు ముమ్మ‌రం చేశార‌ని లాస్ఏంజెల్స్ టైమ్స్ పేర్కొంది. చైనా లునార్ న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో కాల్పులు జ‌రిగాయ‌ని తెలిపింది. శ‌నివారం రాత్రి జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో వేలాది మంది పాల్గొన్నారు. కాగా ఈ ఘ‌ట‌న‌లో ప‌ది మంది మ‌ర‌ణించ‌గా ప‌లువురు గాయ‌ప‌డ్డార‌ని స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement