బ్యాంకింగ్ స్కామ్ల నేపథ్యంలో తెరకెక్కింది సర్కారు వారి పాట చిత్రం. ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ రెట్టింపు అంచనాలను నమోదు చేసింది.హీరో మహేశ్ బాబు.. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ సంస్థలతో కలిసి మహేష్బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.పరుశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లలో తీరిక లేకుండా పాల్గోంటుంది. ఇటీవలే పరశురాం, కీర్తిసురేష్ ప్రమోషన్లలో పాల్గొని చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక పోలీస్ గ్రౌండ్స్లో శనివారం గ్రాండ్గా జరుగనుంది. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు అభిమానులకు ఓ బహిరంగ లేఖను రాశారు. ఆ లేఖలో ‘సర్కారు వారి పాట అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతుంది. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు’ అని లేఖలో వెల్లడించాడు. అంతేకాకుండా త్రివిక్రమ్తో తన సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్లో మొదలవుతుందన్ని చెప్పారు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట వైరల్గా మారింది. మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండున్నరేళ్ళు దాటింది. ఈయన నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement