Friday, April 19, 2024

హిందీ ప్రశ్నపత్రం లీకేజీపై సబిత ఇంద్రారెడ్డి ఆరా..

టెన్త్‌ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజునే తెలుగు ప్రశ్నపత్రం లీకవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రశ్నపత్రాల లీకేజీ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. వరంగల్‌ జిల్లాలో పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో లీక్‌ అయిందంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆరా తీశారు. ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని వరంగల్‌, హనుమకొండ జిల్లాల డీఈవోలు మంత్రికి తెలిపారు. పరీక్షలు సజావుగా సాగుతున్నాయని చెప్పారు. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు వరంగల్‌ సీపీకి ఫిర్యాదు చేయాలని డీఈవోలను మంత్రి సబిత ఆదేశించారు. హిందీ ప్రశ్నపత్రం కూడా వాట్సాప్‌లో లీక్‌ అయిందంటూ ప్రచారం జరగడంతో వరంగల్‌, హనుమకొండ డీఈవోల నుంచి మంత్రి సబిత ఇంద్రారెడ్డి వివరణ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement