Tuesday, April 16, 2024

తెలంగాణ స‌ర్కార్ పై – విమ‌ర్శలు గుప్పించిన ఆర్ ఎస్ ‘ప్ర‌వీణ్ కుమార్’

బ‌హుజ‌న యాత్ర పేరిట తెలంగాణ‌లో ఇటీవ‌లే పాద‌యాత్ర‌ని ప్రారంభించారు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ క‌న్వీన‌ర్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఈ మేర‌కు ఆయ‌న తెలంగాణ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు.బంగారు తెలంగాణ చేస్తాన‌ని చెప్పిన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని బాకీల తెలంగాణ‌గా చేశారంటూ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ ప్ర‌భుత్వ జ‌మాఖ‌ర్చుల‌పై కాగ్ విడుద‌ల చేసిన నివేదిక‌ను ఆధారం చేసుకుని ప్ర‌వీణ్ కుమార్.. కేసీఆర్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మ పార్టీ ప్ర‌భుత్వం వ‌స్తే ప్ర‌తి పైసా లెక్క‌ను ప్ర‌జ‌ల‌ను చూపిస్తామ‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న.. ప్ర‌జా ధ‌నాన్ని దోచిన నాయ‌కుల లెక్క కూడా తేలుస్తామంటూ హెచ్చ‌రించారు. దోచిన డ‌బ్బుల‌ను ముక్కు పిండి మ‌రీ వ‌సూలు చేసి రాష్ట్రంలో పాఠ‌శాల‌లు, వైద్య శాల‌లు నిర్మిస్తామ‌ని ప్ర‌వీణ్ తెలిపారు. కాగ్ నివేదిక‌పై వెలుగు ప‌త్రిక‌లో వ‌చ్చి న ఓ క‌థ‌నాన్ని ప్ర‌వీణ్ త‌న ట్వీట్‌కు జ‌త చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement