Sunday, May 19, 2024

Followup: రేప్ కేసు నిందితుల ఫొటోలు, వీడియో రిలీజ్‌ చేసిన‌ రఘునందన్‌.. ఉలిక్కిపడ్డ ఇంటెలిజెన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మైనర్‌ బాలికపై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం పూర్తిగా అప్రమత్తమైంది. ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అప్రమత్తమైన పోలీసులు అంతర్గతంగా విచారణ మొదలు పెట్టారు. పోలీసుల నిర్లిప్త వైఖరితో ఎప్పుడైతే బహిరంగమైందో అప్పటి నుంచి రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాలికపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను బహిర్గతం చేయడంతో ఇంటెలీజెన్స్‌ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. కేసు ప్రాధాన్యత నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఆనవాళ్ళు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏకంగా కారులో బాలికపై యువకులు జరిపిన అఘాయిత్యానికి సంబంధించిన పుటేజీ వెలిక్కి రావడం పట్ల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రఘునందన్‌రావు పార్టీ కార్యాలయంలో వీడియోలు, ఫొటోలు మీడియాకు రిలీజ్‌ చేసిన ఘటన వెంటనే ఇంటెలిజెన్స్‌ అధికారులు మరింత అప్రమత్తమై సమీక్ష జరిపారు. అత్యంత పకడ్బంధీగా కేసు దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఏకంగా కారులో అమ్మాయిపై జరిపిన లైంగిక దాడికి సంబంధించిన పుటేజీ ఎలా బహిర్గతమైందన్న అంశంపై చర్చించారు. ఇంటెలిజెన్స్‌లోని కొంతమంది ఈ పుటేజీని ఎమ్మెల్యేకు చేరవేశారన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. వీడియో లీకేజీలపై అంతర్గత విచారణ జరపాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement