Friday, March 29, 2024

మోడీ స‌ర్కారును ప్ర‌జ‌లే గ‌ద్దె దించుతారు.. మ‌మ‌తా బెన‌ర్జీ

అధికార మ‌దంతో ప్ర‌జ‌ల‌ను తొక్కిపెడుతున్న మోడీ స‌ర్కార్‌ను దేశ ప్ర‌జలే రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో కూల్చివేస్తార‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ హెచ్చ‌రించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సార‌ధ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వంపై మ‌మ‌తా బెన‌ర్జీ విరుచుకుప‌డ్డారు. మ‌హారాష్ట్ర‌లో ఉద్ధ‌వ్ ఠాక్రే స‌ర్కార్‌ను అప్ర‌జాస్వామికంగా కూల్చివేశార‌ని, అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతూ ప్ర‌జా ప్ర‌భుత్వాల‌ను గ‌ద్దెదింపుతున్నార‌ని మండిప‌డ్డారు. మోడీ ప్ర‌భుత్వం అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతోంద‌ని, ప్ర‌తీకారేచ్చ‌తో ర‌గులుతూ అక్ర‌మ ప‌ద్ద‌తుల్లో ప్ర‌భుత్వాల‌ను కూల్చుతోంద‌ని ఆరోపించారు.
మ‌హారాష్ట్ర‌లో వారు గెలిచినా ప్ర‌జ‌ల హృద‌యాల‌ను వారు గెల‌వ‌లేర‌ని మ‌మ‌తా బెన‌ర్జీ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement