Thursday, April 18, 2024

Breaking: కొండ‌గ‌ట్టుకు చేరుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచార రథం వారాహికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ జనసేన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. కొడిమ్యాల మండలం నాచుపల్లిలో నేతలతో పవన్ సమావేశం ఉండనుంది. నారసింహా క్షేత్రాల సందర్శనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పవన్ పూజలు చేయనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమై అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో క్యాడర్ కు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement