Friday, May 3, 2024

TS | మా ఊరి మహాలక్ష్మి.. బీఆర్ఎస్ నేత దాతృత్వం, ఆడ‌బిడ్డ పుడితే 16వేల న‌గ‌దు అంద‌జేత‌!

శంకర్ పల్లి, (ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామంలో మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత స్వ‌ర్గీయ‌ ఇంద్రారెడ్డి జయంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ యువ నాయకుడు గౌడిచర్ల వెంకటేష్ మా ఊరి మహాలక్ష్మి కార్యక్రమాన్ని చేప‌ట్టారు. కాగా, ఇవ్వాల (బుధ‌వారం) ఈ కార్య‌క్ర‌మాన్ని మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ పరిధిలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆయన తన సొంత నిధులతో 16వేల రూపాయల నగదును అమ్మాయి తల్లిదండ్రులకు అందజేస్తున్నారు.

గ‌త దసరా రోజు ప్రకటించినట్లుగా ఆయన ఈ కార్యక్రమాన్ని దాదాపు 55 మంది అమ్మాయిల‌ తల్లిదండ్రులకు 8.80ల‌క్ష‌ల‌ మొత్తాన్ని అట్టహాసంగా ఇవ్వాల‌ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి చేతుల‌మీదుగా అందజేశారు. కాగా, బీఆర్ఎస్ నేత‌ గౌడిచర్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఇంద్రారెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, శంక‌ర్‌ప‌ల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement