Friday, May 3, 2024

మోడీ త‌ల్లికి వంద సంవ‌త్స‌రాలు – పాద‌పూజ చేసిన ప్ర‌ధాని

వందవ‌ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టారు ప్ర‌ధాని మోడీ త‌ల్లి హీరాబెన్.. ఈ సందర్భంగా తన తల్లిని మోడీ కలిశారు. ఈ ఉదయం గాంధీనగర్ లోని తన తల్లి నివాసానికి ఆయన వెళ్లారు. తన తల్లికి పాదపూజ చేసి, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెకు స్వీట్ తినిపించారు. ప్రస్తుతం మోడీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పంచమహల్ జిల్లాలోని ప్రముఖ ఆథ్యాత్మిక కేంద్రం పావగఢ్ ను ఆయన సందర్శించనున్నారు. మరోవైపు వందేళ్ల వయసులో కూడా హీరాబెన్ మోడీ ఎంతో ఆరోగ్యంగా, ఫిట్ గా ఉన్నారు. ఈ వయసులో కూడా ఆమె అనారోగ్యానికి గురయినట్టు ఎప్పుడూ వార్తలు రాలేదు. తన చిన్న కుమారుడు పంకజ్ మోడీ వద్ద ఆమె ఉంటున్నారు. హీరాబెన్ కు చాలా సింపుల్ ఫుడ్ తీసుకోవడం అలవాటు. ఆమె ఆరోగ్యానికి అదే కారణం కావచ్చని అంటుంటారు. ఎక్కువ మసాలా, నూనె ఉన్న ఆహారాన్ని ఆమె తీసుకోరు. అన్నం, కిచిడి, చపాతి, పప్పు వంటివి ఆమె ఆహారంలో ఉంటాయి. స్వీట్స్ విషయానికి వస్తే షుగర్ క్యాండీని ఆమె ఇష్టపడతారట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement