Friday, May 17, 2024

వామ్మో.. దెయ్యం చెట్లు.. చూడ్డానికి ఎగ‌బ‌డుతున్న టూరిస్టులు..

దెయ్యాలున్నాయా.. మీరెప్పుడైనా చూశారా.. అంటే కొంత‌మంది అవును అని, ఇంకొంద‌రు లేదు అంటుంటారు. అయితే ఎవ‌రి న‌మ్మ‌కాలు వాళ్ల‌వి. కానీ, మ‌నం సినిమాల్లో చూసిన‌ట్టు దెయ్యాలు తెల్ల‌టి బ‌ట్ట‌లు ధ‌రించి.. జ‌నాల‌ను భ‌య‌పెడుతుంటాయి. కానీ, పాకిస్తాన్‌లో మాత్రం ఓ వింత దృశ్యం జ‌నానులకు ఆస‌క్తి క‌లిగించింది. అదేంటంటే.. దెయ్యం రూపంలో ఉన్న చెట్లు ఆ ఏరియాకు సంద‌ర్శ‌కుల రాక‌ను పెంచాయి. ఈ వింత చెట్ల‌ను చూడ్డానికి చాలామంది టూరిస్టులు క్యూ క‌ట్టారు. దీంతో పాకిస్తాన్‌లోని సింధ్ గ్రామం ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా మారింది.

2010లో వ‌చ్చిన‌ భారీ వరదలతో లక్షలాది సాలె పురుగులు చెట్లపైకి చేరాయి. కాలక్రమేణా అవి గూళ్ల‌ను అల్ల‌డంతో ఆ చెట్లు ఇప్పుడు అచ్చం సినిమాల్లో చూపించే దెయ్యంలా క‌నిపిస్తున్నాయి. దీంతో వాటిని చూడ్డానికి ప‌ర్యాట‌కులు వ‌స్తున్నార‌ని సింధు గ్రామ‌స్తులు హ్యాపీగా చెబుతున్నారు. వాటితో త‌మ‌కెప్పుడు ఇబ్బంది క‌ల‌గ‌లేదంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement