Saturday, September 21, 2024

ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ కి – ‘నోబెల్ ప్రైజ్’ నామినేట్ కి యురోపియ‌న్ పొలిటీషియ‌న్స్ ప్ర‌తిపాద‌న‌లు

ర‌ష్యా ..ఉక్రెయిన్ ల మ‌ధ్య యుద్ధం జ‌రుగుతూనే ఉంది. అయితే ఉక్రెయిన్ సైన్యం అలుపెరుగ‌ని పోరాటం చేస్తూనే ఉంది. భీకర దాడులతో ర‌ష్యా సేనలు వణికిస్తున్నప్పటికీ తమ పౌరుల వెంటే ఉన్నానంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆ దేశ పౌరులకు మద్దతుగా నిలుస్తుండడం.. ఆయనను నిజమైన హీరోగా నిలబెడుతుంది. ఓవైపు ప్రపంచ దేశాల సాయం కోరుతూనే.. మరోవైపు యుద్ధానికి ముగింపు పలకాలని శత్రుదేశం తో చర్చలు కొనసాగిస్తున్న ప్రయత్నాలు దేశాధినేతలను కదిలిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి నోబెల్ పీస్ ప్రైజ్ కి Nobel Peace Prizeకి నామినేట్ చేయాలని ప్రతిపాదనలు మొదలయ్యాయి. అయితే ఈ ఏడాది పురస్కారాల కోసం దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసిపోవడంతో జెలెన్ స్కీ కోసం దాన్ని పొడిగించాలని కోరుతూ యూరోపియన్ నేతల నుంచి విజ్ఞప్తులు ఎక్కువయ్యాయి. ‘ నోబెల్ శాంతి బహుమతికి జెలెన్ స్కీని నామినేషన్ అనుమతించేందుకు గానూ..నామినేషన్ విధానం దరఖాస్తు ప్రక్రియను పున:పరిశీలించండి. ఇందుకోసం తేదీని మార్చి 31, 2022 వరకు పొడిగించండి. ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఆ దేశ ప్రజల కోసం నోబెల్ కు దరఖాస్తు చేసుకునే అంశాన్ని పరిగణలోకి తీసుకోండి’ అని నార్వేజియన్ నోబెల్ కమిటీకి విజ్ఞప్తి చేస్తూ యూరోపియన్ నేతలు లేఖ రాశారు.

అయితే, 2022 నోబెల్ బహుమతి కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో దాన్ని తిరిగి తెరవాలని యూరోప్ నేతలు కోరుతున్నారు. ఇక ఈ ఏడాది నోబెల్ బహుమతుల ప్రధానోత్సవం అక్టోబర్ 3 నుంచి 10 తేదీల్లో జరగనుండగా ఒక్క నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రపంచవ్యాప్తంగా 250 మంది వ్యక్తిగతంగా 92 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే, సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దండయాత్రను ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక, సాంకేతిక ఆంక్షలతో రష్యాను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ రష్యా చేస్తున్న భీకర దాడులను ఉక్రెయిన్ కు దీటుగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో దాదాపు 14 వేల మంది రష్యా సేనలను అంతం చేసినట్లు పేర్కొన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కూడా భారీగా ప్రాణ ఆస్తి నష్టాన్ని చవి చూస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement