Friday, April 19, 2024

Terror | జమ్మూ కాశ్మీర్​లో రేపటి నుంచి జీ20 భేటీ.. టెర్రర్​ గ్రూపు మెంబర్​ని అరెస్టు చేసిన ఎన్​ఐఏ​

జమ్మూ కాశ్మీర్​లో రేపటి (సోమవారం) నుంచి జీ20 భేటీ జరగనుంది. దీనికి ముందు అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు సపోర్టు చేస్తున్న వారిపై నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ (ఎన్​ఐఏ) దృష్టిపెట్టింది. తనిఖీల్లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) జైషే మహ్మద్​ (జెఈఎం) గ్రూపునకు చెందిన కార్యకర్తను ఎన్​ఐఏ అరెస్టు చేసింది. సైనికులు, భద్రతా బలగాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్​లోని కమాండర్​కు చేరవేస్తున్నట్టు ఎన్​ఐఏ గుర్తించింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కుట్ర కేసులో ప్రమేయం ఉన్నందున.. కాశ్మీర్‌కు చెందిన జైషే మహ్మద్ (జెఇఎం) కార్యకర్తను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఇవ్వాల (ఆదివారం) అరెస్టు చేసింది. ఆ ఉగ్రవాదిని కుప్వారా జిల్లాకు చెందిన ఉబైద్ మాలిక్‌గా గుర్తించారు. కాశ్మీర్​ లోయలో జరగాల్సిన G-20 సమావేశానికి ముందు NIA ఈ అరెస్టు చేయడం గమనార్హం. నిందితుడు భారత రహస్య సమాచారాన్ని పాకిస్థాన్​కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ తెలిపింది. సైనికులు, భద్రతా బలగాల కదలికలకు సంబంధించిన ఇన్​ఫర్​మేషన్​ని పాకిస్థాన్‌లోని కమాండర్‌కు చేరవేస్తున్నాడని ఎన్​ఐఏ అధికారులు తెలిపారు.

కాగా, ఉగ్రవాది ఉబైద్ నుంచి కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. అతను ఏదో పెద్ద ఉగ్రవాద కుట్రను అమలు చేయడానికి యత్నిస్తున్నాడని అధికారులు చెప్పారు. జూన్ 2022లో కాశ్మీర్​ లోయలో ఉగ్రవాద కుట్రకు సంబంధించి NIA ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. లోయలో టెర్రర్ ప్లాట్‌ను అమలు చేసేలా నిర్దేశిస్తున్న పాకిస్తానీ కమాండర్‌తో పరిచయం ఉన్న బహుళ ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలపై ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

- Advertisement -

ఇక.. హవాలా మార్గాలు, ఆయుధాలు, ఐఈడీలు, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే స్టిక్కీ బాంబులు, మాగ్నెటిక్ బాంబులను భద్రపరచడం.. వీటి కోసం నగదు వసూలు చేయడం ద్వారా ఉగ్రవాద కుట్రను అమలు చేయడం గురించి ఈ ఎఫ్​ఐఆర్​లో ప్రస్తావించారు.  NIA తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ నుండి డ్రోన్‌ల ద్వారా ఐఈడీలు, పేలుడు పదార్థాలను నిరంతరం భారతదేశానికి పంపిస్తున్నారు. అవి స్థానికంగా ఉండే వారికి చేరుతున్నాయి. భద్రతా దళాలపై దాడి చేయడానికి, కాశ్మీర్​ లోయలోని మైనారిటీలను టార్గెట్​ చేసుకుని వీటిని ఉపయోగిస్తున్నారు.

దేశంలో మత సామరస్యాన్ని చెడగొట్టడం..ఉగ్రవాద కుట్ర అమలు చేయడం ద్వారా భారత ప్రభుత్వంపై వార్​ప్రకటించడం వీరి ముఖ్య ఉద్దేశ్యం. సోషల్ మీడియా యాప్‌లలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం.. కోడ్ వర్డ్ లలో మెస్సేజులు పంపుకుని కుట్ర పన్నారని NIA తెలిపింది. కాగా, సోమవారం శ్రీనగర్‌లో జీ20 సమావేశం జరగనుంది. ఈ సమావేశం దృష్ట్యా జమ్మూకశ్మీర్ మధ్య అంతర్జాతీయ సరిహద్దులోనూ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ సమావేశం మే 24 వరకు కొనసాగనుంది. చీనాబ్ నది వెంబడి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన స్పెషల్​ ఫోర్స్​ వింగ్​.. ప్రత్యేక పడవలతో పెట్రోలింగ్‌ను పెంచిందని అధికారులు తెలిపారు. ఈ పడవలు చీనాబ్ నదిలో నిరంతరం గస్తీ కాయడానికి ఉపయోగిస్తున్నారు. ఇక.. నది వెంబడి సరిహద్దు ప్రాంతంలో సెక్యూరిటీకి ప్రత్యేకంగా వీటిని  రూపొందించారు. రాత్రి, పగలు తేడా లేకుండా బోట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఫుట్‌ పెట్రోలింగ్‌, వాహనాల పెట్రోలింగ్‌ కూడా పెంచినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement