Saturday, May 18, 2024

పెరిగిన క‌రోనా కేసులు-47మంది మృతి

రోజు రోజుకి క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. నేడు దేశంలో కొత్త‌గా 20,409 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా 47 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసులు 4,39,79,730కి చేరగా, 5,26,258 మంది మరణించారు. ఇప్పటివరకు 4,33,09,484 మంది బాధితులు కోలుకున్నారు. మరో 1,43,988 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.48 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 203.60 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.గత 24 గంటల్లో 22,697 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement