Friday, May 3, 2024

పిస్టల్​తో కాల్చుకుని నేవీ ఉద్యోగి ఆత్మహత్య.. ముంబై హార్బర్​లో ఘటన

25 ఏళ్ల ఇండియన్ నేవీ ఉద్యోగి​ ముంబై హార్బర్‌లోని ఓడలో తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించిన సర్వీస్‌మెన్​ని హ్యాపీ సింగ్ తోమర్‌గా గుర్తించారు. అతను చెన్నైలోని ఐఎన్​ఎస్​ యుద్ధనౌక టెక్నికల్​ టీమ్​లో పనిచేస్తున్నాడు. తన భార్యతో కలిసి నేవీ నగర్ అధికారిక క్వార్టర్స్ లో ఉంటున్నాడు. కాగా, ఈ కేసులో కోలాబా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం వంటి లాంఛనాలు పూర్తయిన తర్వాత అతని మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

కాగా, దీనికి సంబంధించి ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. పోలీసు విచారణ, స్పాట్ విజిట్ చేశామని, జెజె ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కూడా కంప్లీట్​ అయినట్టు తెలిపారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్య అనే అనుకుంటున్నామని తెలిపారు. అతను ఛాతీపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సర్వీస్ పిస్టల్ బుల్లెట్ ఛాతీని చీల్చుకుని బయటికి వెళ్లింది. అయితే.. పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. అతను ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నాడో లేదో తెలుసుకోవడానికి అతని మొబైల్ ఫోన్‌ని స్కాన్ చేస్తున్నాం అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement