Saturday, May 18, 2024

More Records: 28 ఓవర్లకే టార్గెట్​ రీచ్​.. దంచిపడేసిన టీమిండియా..

టీమిండియా ప్లేయర్స్​ అటు బౌలింగ్​, బ్యాటింగ్​లో సమష్టిగా రాణించారు. ఇవ్వాల వెస్టిండీస్​తో జరిగిన వన్డే మ్యాచ్​లో తమ సత్తా చాటి చెప్పారు. కొవిడ్​ మహమ్మారితో కొంతమంది సీనియర్​ ప్లేయర్స్​ లేకున్నా ఇండియా జట్టు పటిష్టంగానే ఉందని చాటారు. తొలుత విండీస్​ను 176 పరుగులకే కట్టడి చేసిన తీరు చాలా బాగుంది. ఆ తర్వాత బ్యాటింగ్​లోనూ 28 ఓవర్లలోనే 177 పరుగుల టార్గెట్​ను చేజ్​ చేసి రికార్డు సృష్టించారనే చెప్పవచ్చు.

మొత్తంగా ఈ వన్డే మ్యాచ్​లో అద్భుతమైన రికార్డులు నెలకొన్నాయి.

1) చాహల్​ 4వికెట్లు తీసుకుని 100 వికెట్ల క్లబ్​లో చేరాడు

2) ఇప్పటిదాకా ఉన్న సచిన్​ రికార్డు 5,000 పరుగుల రన్స్​ని విరాట్​ కోహ్లీ దాటేశాడు

3) టీమిండియా ఆడిన 1000వ వన్డే మ్యాచ్​ కావడం వంటి పలు రికార్డులను టీమిండియా సొంతం చేసుకుంది.

- Advertisement -

4) 177 ప‌రుగుల స్కోరును టీ20 మాదిరికా 28 ఓవ‌ర్ల‌లోనే రీచ్ కావ‌డం

Advertisement

తాజా వార్తలు

Advertisement