Friday, May 17, 2024

తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపేస్తారు: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్య

మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. నిజామాబాద్ పర్యటనలో బీజేపీపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నించిన బీజేపీకి తెలంగాణలో పుట్టగతులు ఉండాలా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే.. తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేస్తారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం అంటూ డైలాగులు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు.

తెలంగాణకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రధాని మోదీ నెరవేర్చలేదన్నారు. తెలంగాణకు బీజేపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఎందుకు వివక్ష చూపుతున్నారని నిలదీశారు. మోదీ ప్రధానిగా అధికారం చేపట్టి ఏడేళ్లు దాటుతున్నా తెలంగాణకు ఎలాంటి ప్రాజెక్టులు మంజూరు చేయలేదన్నారు. గిరిజన యూనివర్సిటీ కావాలని అడిగితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement