Sunday, April 28, 2024

Revenge | నిశ్చితార్థం క్యాన్సిల్​ చేసుకున్నారని.. యువతని కత్తితో పొడిచి చంపేశాడు!

పెళ్లీడుకొచ్చిన తమ కూతురుకు మంచి సంబంధం చూడాలనుకున్నారు. చాలాకాలంగా సంబంధాలు వస్తున్నా ఏవీ మ్యాచ్​ కావడం లేదు. ఈ క్రమంలో వారికి ఓ అబ్బాయి నచ్చాడు. అమ్మాయి, అబ్బాయి కుటుంబాల వారు కలిసి మాట్లాడుకున్నారు. పెళ్లిచూపులు పూర్తయ్యాయి. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక.. పెళ్లి పనుల్లో అంతా బిజీగా ఉన్నారు. ఇంతలోనే వారికి అబ్బాయి తీరుపై అనుమానాలు వచ్చాయి. పెళ్లి క్యాన్సిల్​  చేద్దామనుకున్నారు.ఈ  విషయం తెలుసుకున్న యువకుడు ఆ యువతిని దారికాచి అటకాయించాడు. కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్​లో జరిగింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

గురుగ్రామ్‌లోని మౌలాహెంగా గ్రామంలో 19 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసుకు సంబంధించి పాలెం విహార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడిని పోలీసులు రామ్‌కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో హత్యకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయిన యువతి కుటుంబంతో కలిసి మౌలాహెడ గ్రామంలో రాజ్‌కుమార్ నివసించినట్లు తేలింది. వారిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా వాసులుగా పోలీసులు తెలిపారు.

రాజ్​కుమార్​, ఆ యువతి నిశ్చితార్థం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల బాధితురాలి కుటుంబ సభ్యులు వారి నిశ్చితార్థాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది నిందితుడికి కోపం తెప్పించింది. అతను తన ప్రణాళికను అమలు చేయడానికి సరైన అవకాశం కోసం వేచి ఉన్నాడు. మృతురాలు ఓ ఇంట్లో పనిచేసే క్రమంలో తనపై కత్తితో దాడి చేసి చంపేశాడు.   నిందితుడి నుంచి కత్తి, మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దారుణ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది, ఇందులో ఒక వ్యక్తి తన తల్లితోపాటు ఉన్న బాధితురాలి వద్దకు వస్తున్నట్లు కనిపించింది. ఇద్దరూ మొదట మాట్లాడుకోవడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత అతను కత్తి తీసి అటాక్​ చేయడంతో ఆమె తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. అంతే వేగంగా ఆ వ్యక్తి ఆమెను పదేపదే కత్తితో పొడిచడం ప్రారంభించాడు. ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. ఇక.. ఆమె చుట్టూ ఉన్న వారంతా హాహాకారాలు చేస్తూ సంఘటన స్థలం నుండి పారిపోయారు. కానీ, ఆ యువతిని కాపాడాలని ఎవరూ చూడలేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement