Friday, May 10, 2024

Breaking: గవర్నర్​ను ట్విట్టర్​లో​ బ్లాక్​ చేసిన మమత.. ఫోన్లు ట్యాప్​ చేస్తున్నారని ఆరోపణ..

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్​ను ట్విట్టర్​లో బ్లాక్​ చేశారు. అతనితో విధానపరమైన విభేదాల కారణంగానే బ్లాక్​ చేయాల్సి వచ్చిందన్నారు మమతా. కాగా, అతని తీరు అస్సలు బాగాలేదని, ఇప్పటికి ఎన్నో ఫైళ్లు సంతకాలు చేయకుండా పెండింగ్​లో పెడుతున్నారని  పేర్కొన్నారు. ఇప్పటిదాకా చాలా ఓపికిగా ఎదురుచూశాం.

చాలా సార్లు అతని ధోరణిపై ప్రధాని మోడీకి కూడా లేఖలు రాశాను. అయినా అతని ప్రవర్తనలో కొంచెం కూడా మార్పు రాలేదు. పైగా పెగాసెస్​ వంటి స్పైవేర్​ని గవర్నర్​ తన హౌస్​ నుంచి నడిపిస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. ఇవ్వన్నీ ప్రధానికి చెప్పినా అతడిని తొలగించకపోవడంలోఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు అని మమత చెప్పుకొచ్చారు.. తమ ఫోన్​లను ట్యాప్​ చేస్తున్నారని గవర్నర్​పై దీదీ అభియోగాలు మోపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement