Friday, May 3, 2024

Tweet | కేటీఆర్ భావోద్వేగం.. కుమారుడిని మిస్ అవుతున్నాన‌ని ట్వీట్‌!

తన కుమారుడు హిమాన్షూ ఫొటోను నెట్టింట షేర్ చేశారు మంత్రి కేటీఆర్.. అతడిని మిస్సవుతున్నానంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై పెద్ద ఎత్తున స్పందిస్తున్న అభిమానులు.. హిమాన్షూ కూడా ఇలాగే ఫీలవుతుంటాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అతడు కంటికెదురుగా లేకపోవడంతో తండ్రిగా కేటీఆర్‌కు బాధ అనిపించినా భవిష్యత్తులో కుమారుడి విజయాలు చూసి మురిసిపోతారని ఇంకొంత‌మంది కామెంట్ చేస్తున్నారు.

కాగా, ఉన్నత చదువులకోసం హిమాన్షూ అమెరికాకు వెళ్లాడు. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ త‌ర్వాత‌ హిమాన్షూ ఆగస్టులో అమెరికాకు వెళ్లాడు. అప్పుడు కేటీఆర్-శైలిమ దంపతులు, చెల్లి అలేఖ్య కూడా వెళ్లారు. ఈ క్రమంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యాక వారం రోజులకు కేటీఆర్ తన కుటుంబంతో కలిసి ఇండియాకు తిరిగొచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement