Friday, May 17, 2024

TRS VS BJP: కేటీఆర్, రాజాసింగ్ మధ్య మాటల యుద్ధం

మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి, యోగి ఆదిత్యనాథ్ కు మద్దతు ఇవ్వకపోతే యూపీని వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుందని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యూపీలో బీజేపీకి ఓటు వేయని వారిని గుర్తించి గట్టిగా బుద్ధి చెబుతామని ఆ వీడియోలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీలో మరో అద్భుత హాస్యనటుడు కనిపించాడని అన్నారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు రాజాసింగ్ మళ్లీ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో పెద్ద జోకర్ ఎవరో అందరికి తెలుసని అన్నారు. కేటీఆర్ ను ట్విట్టర్ మెన్ అని అన్నారు. యూపీలో దేశద్రోహులు, హిందు ద్రోహులపై బుల్డోజర్లు ఎక్కిస్తామని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement