Thursday, April 25, 2024

కేఆర్‌ఎంబీ పరిధిలోకి సాగర్, శ్రీశైలం.. నేటి నుంచే గెజిట్ అమలు

కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ నేటి(అక్టోబర్ 14) నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు లేఖ రాసింది. మొదటి దశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి అవకాశముందని కేఆర్ఎంబీ బోర్డు ఉపసంఘం గుర్తించింది. మిగిలిన చోట్ల రెండు రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలు ఉండటంతో ప్రస్తుతానికి వీలు కాదని తెలిపింది. ప్రాజెక్టుల వారీగా సిబ్బంది కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా సమగ్రంగా ముసాయిదా తయారు చేసింది.

గెజిట్ లోని పలు అంశాలపై తెలంగాణ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమకు ఇంకా నీటి కేటాయింపులు జరగనందున గెజిట్ నోటిఫికేషన్ అమలు కొన్నాళ్లు పాటు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇక, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి రాకుంటే ప్రయోజనం ఏంటన్న అభిప్రాయాన్ని ఏపీ అధికారులు వ్యక్తం చేశారు. సాగునీటి అవసరాలు లేకున్నా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని దిగువకు వదిలినందువల్లే వివాదం తలెత్తిందని..దీంతో గెజిట్ వచ్చిందని ఏపీ సర్కార్ చెబుతోంది.

ఇది కూడా చదవండి: వృద్ధిరేటులో తెలంగాణ టాప్‌.. సంక్షేమానికి ఢోకాలేద‌న్న‌ కేసీఆర్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement