Friday, May 3, 2024

India Corona: దేశంలో కొత్తగా 2538 కేసులు

భారత్ లో కరోనా మహమ్మారి కేసులు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,538 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో 60 మంది బాధితులు మరణించగా..  2012 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 30,799 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 86. 99 శాతంగా ఉంది.

మరోవైపు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,01,477 కు చేరింది. ఇందులో 4,24,54,546 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,80,80,24,147 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement