Sunday, April 28, 2024

ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నా – సోనూసూద్

ఉక్రెయిన్, రష్యా మధ్య మొదలైన యుద్ధం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచం కళ్ళు ఈ యుద్ధంపైనే ఉన్నాయి.. ప్రతి ఒక్కరూ ఈ యుద్ధం గురించి కలవరపడుతున్నారు. ఈ సమయంలో, ఉక్రెయిన్‌లో ఇంకా కొంతమంది భారతీయులు చిక్కుకోవడం అత్యంత ఆందోళనకరమైన విషయం. వీరి గురించి ఇప్పుడు బాలీవుడ్ నటుడు, సామాజిక‌వేత్త సోనూ సూద్ ఆందోళన వ్యక్తం చేశారు. సోనూ సూద్ ట్వీట్ చేస్తూ ఇలా వ్రాశాడు “18000 మంది భారతీయ విద్యార్థులు .. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన అనేక కుటుంబాలు, వారిని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చేస్తుందని నేను ఆశిస్తున్నాను. ప్రజలను రక్షించడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొనవలసిందిగా నేను భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేస్తున్నాన‌న్నారు. వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాన‌న్నారు.. చాలా మంది విద్యార్థులు మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్‌కు వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement