Thursday, May 9, 2024

Bihar: రైలులో భారీ మంట‌లు : త‌ప్పిన ప్ర‌మాదం

ఓ రైలులో భారీ మంట‌లు చెల‌రేగిన ఘ‌ట‌న‌ బీహార్‌లో జ‌రిగింది. మ‌ధుబ‌ని రైల్వే స్టేష‌న్‌లో ఈరోజు ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఆగి ఉన్న రైల్లో మంట‌లు ఒక్క‌సారిగా చెల‌రేగాయి. అన్ని బోగీల‌కు మంట‌లు వ్యాపించ‌డంతో అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్ముకున్నాయి. అప్ర‌మ‌త్త‌మైన రైల్వే సిబ్బంది, కూలీలు, అగ్నిమాప‌క శాఖ సిబ్బంది మంట‌ల‌ను ఆర్పేందుకు య‌త్నిస్తున్నారు. అయితే అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన స‌మ‌యంలో రైల్లో ప్ర‌యాణికులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement