Monday, May 13, 2024

ఆక్సిజన్ ట్యాంకర్‌ ను ఢిల్లీ ప్రభుత్వం దొంగిలించింది: హర్యానా మంత్రి

తమ రాష్ట్రానికి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒకదాన్ని ఢిల్లీ ప్రభుత్వం దొంగతనంగా తీసుకెళ్లిందని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ ఆరోపించారు. ఫరీదాబాద్ కు నిన్న వస్తున్న ట్యాంకర్ ను ఢిల్లీ ప్రభుత్వం తీసుకెళ్లిందని తెలిపారు. అప్పటి నుంచి ఆక్సిజన్ ను తీసుకొస్తున్న వాహనాలకు పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించానని అనిల్ విజ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలే ఇలాంటి పనులకు పాల్పడితే, ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుందని పేర్కొన్నారు. తమ ఆక్సిజన్ ను ఢిల్లీకి పంపించాలని ఒత్తిడి వస్తోందని, వారికి ఆక్సిజన్ పంపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, తమ రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే తాము ఆ పని చేయగలమని తెలిపారు.

దేశంలో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు రెండు లక్షలకు పైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఏ రోజుకారోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇక హర్యానాలోనూ వైరస్ విజృంభిస్తోంది. దీనికి తోడు పలు ఆసుప్రతుల్లో ఆక్సిజన్‌ కొరత కూడా ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement