Thursday, April 25, 2024

న్యూయార్క్ లో గ్రీట్ అండ్ మీట్.. రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేత‌లు

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో క‌లిసి విందులో పాల్గొన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు. రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘గ్రీట్‌ అండ్‌ మీట్‌’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తదితర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, కాంగ్రెస్ ఓవర్సీస్ ప్రెసిడెంట్ శామ్ పిట్రోడా తదితరులు హాజరయ్యారు. మరోవైపు న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను భారీ స్క్రీన్ పై ప్రదర్శించారు. తెలంగాణలో ఆయన సాగించిన యాత్ర విశేషాలతో వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియోను రేవంత్, ఇతర నేతలు ఆసక్తిగా తిలకించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement