Sunday, May 5, 2024

Good News | కరీంనగర్ సీపీ ఆధ్వర్యంలో 11న మెగా జాబ్ మేళా

కరీంనగర్ కమిషనరేట్ పాలీసుల ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన ఉచిత మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు పాలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఈ జాబ్ మేళా గీతాభవన్ చౌరస్తా సమీపంలోని పద్మనాయక కళ్యాణమండపం ఆవరణలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి 10తరగతి ఉత్తీర్ణులై ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పిజి, ఫార్మసి, బిటెక్, ఎంటిక్, ఎంబిఏ, ఎంసిఏ చదివిన అభ్యర్థులు దాదాపు 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.

కాగా, విప్రో, జెన్ ప్యాక్, టాటా సర్వీసెస్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, ఇండిగో ఎయిర్ లైన్స్ గూగుల్ పే, రిలయన్స్ జియో కంపెనీలతోపాటు దాదాపు 120 ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆసిక్తిగల అభ్యర్థులు, విద్యార్హతలు ఉన్నవారు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో ఈ జాబిమెళాకు హాజరు కావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement