Tuesday, May 14, 2024

Big Breaking | తెలంగాణ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. డీఏ పెంచుతూ సీఎం కేసీఆర్​ నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పారు సీఎం కేసీఆర్​. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ తీపి కబురు తీసుకొచ్చారు. ప్రభుత్వం ఉద్యోగులందరికీ డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ఇవ్వాల (సోమవారం) రాత్రి వెల్లడించారు. అయితే.. ఈ పెంపుదల అనేది జూన్​ నెలకు సంబంధించిన వేతనంతోనే ఉంటుందని చెప్పారు.

2.73శాతం డీఎం పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు​. ఈ శుభవార్తతో ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపుదలతో ఏడాదికి ప్రభుత్వ ఖజానాపై 974.16 కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement