Saturday, May 18, 2024

న‌లుగురు మ‌త్య్స‌కారులు గ‌ల్లంతు-గాలిస్తోన్న అధికారులు

స‌ముద్రంలో నాలుగురోజుల క్రితం వేట‌కు వెళ్లిన న‌లుగురు మత్య్స‌కారులు గ‌ల్లంత‌య్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్రంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. క్యాంబెల్‌ నుంచి అంతర్వేదికి వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల వద్ద సెల్‌ఫోన్‌లు పనిచేయకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.గల్లంతైన మత్స్యకారుల కోసం క్యాంబెల్‌ పేటకు చెందిన మత్స్యకారులు మరో బోటుతో సహాయంతో సముద్రంలో గాలిస్తున్నారు. కాకినాడ సమీపంలో బోటు మోటారు పనిచేయట్లేదని యజమానికి సమాచారం రావడంతో ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement