Sunday, May 5, 2024

హైద‌రాబాద్‌లో అగ్నిప్రమాదం.. నిజాంపేట్‌ పెట్రోల్ బంక్ స‌మీపంలో భ‌వ‌నానికి మంట‌లు

బాచుపల్లి, (ప్రభ న్యూస్): హైద‌రాబాద్‌లోని నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఇవ్వాల (బుధ‌వారం) ఉద‌యం ఓ మ‌ల్టీస్టోరీడ్ బిల్డింగ్‌లో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో పిఈ సినీ స్క్వేర్ ముందు భాగంలో ఉన్న ఓ భవనం లో ఈ అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇదే భవనంలో కాంక్వైట్ స్కూల్ ఉండటంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. కాగా, భవనానికి వెలుపలి గుండా మెట్లు లేకపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు.

సకాలంలో స్కూల్ యాజమాన్యం స్పందించి విద్యార్థులను భ‌వనం నుండి బయటకు తీసుకొచ్చారు. వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వ‌డంతో ప‌వ‌ర్ ఆపేశారు. ఇదే క్రమంలో గతంలో నిజాంపేట్ సెక్టార్ ఎస్సైగా విధులు నిర్వహించిన ఎస్సై విజయ్ అటు వైపు వెళ్తూ ప్రమాదాన్ని గమనించి ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ ఇంజిన్ సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే య‌త్నం చేస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్ప‌టికైతే ఎవరికి ఎలాంటి హాని జరగలేద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement