Tuesday, May 21, 2024

బీజేపీ కార్యాలయానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్

హుజరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.. తొలిసారి హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద సాయంత్రం 4 గంటలకు తెలంగాణ అమరవీరులకు ఈటల నివాళులు అర్పించి… అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్తారు.

కాగా, తెలంగాణలో ఉత్కంఠ రేపిన హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఈటల గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement