Saturday, May 18, 2024

తెలంగాణలో కొత్తగా 3,527 కరోనా కేసులు, 19 మరణాలు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,527 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 3,982 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 5,71,044కు పెరిగాయి. వీరిలో 5,30,025 మంది కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 37,793 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇవాళ్టి వరకు 3226 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 519 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 97,236 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో కోవిడ్‌ రికవరీ రేటు 92.81 శాతంగా ఉంది. మరణాలు రేటు 0.56 శాతంగా ఉందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement