Thursday, April 25, 2024

కంటెయిన‌ర్ లో గంజాయి – ఇద్ద‌రి అరెస్ట్

మ‌రోసారి పెద్ద‌మొత్తంలో గంజాయి ప‌ట్టుబ‌డింది. హైద‌రాబాద్ న‌గ‌ర శివారు హ‌య‌త్ న‌గ‌ర్ పోలీస్ స్టేస‌న్ ప‌రిధిలో అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్ద ఎస్‌వోటీ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ఓఆర్‌ఆర్‌ వద్ద కంటెయినర్‌ను తనిఖీ చేయగా.. అందులో భారీగా గంజాయిని గుర్తించారు. మొత్తం 370 కిలోల మత్తుమందును సీజ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement