Friday, May 17, 2024

Exclusive | తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం నా స్వప్నం.. ఆరు పథకాలను ప్రకటించిన సోనియా

తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రావడమే తన స్వప్నమని, అన్ని వర్గాల అభివృద్ధి, సమన్యాయమే తన ఆకాంక్ష అన్నారు కాంగ్రెస్​ ముఖ్యనేత సోనియాగాంధీ. ఇవ్వాల హైదరాబాద్​ తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో ఆరు పథకాలతో ఉన్న గ్యారెంటీ కార్డుని ప్రకటించారు..

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హైదరాబాద్​లోని తుక్కుగూడ వేదికగా ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం కాంగ్రెస్​ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు కాంగ్రెస్​ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సోనియా గాంధీ ఆరు కీలక పథకాలను ప్రకటించారు. ఇందులో మహాలక్ష్మి పేరుతో 5వందలకే గ్యాస్​ సిలిండర్ అందివ్వనున్నట్టు తెలిపారు​. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. కటుంబంలో మహిళలకు 2500 అందిస్తామని తెలిపారు. రైతు భరోసా కింద 15వేల పెట్టుబడి సాయం ప్రకటించారు. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ ఇస్తామని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12వేల సాయంగా అందిస్తామన్నారు.

ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించిన సోనియా గాంధీ. ప్రతి హామీ నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉంటామని అన్నారు. నా స్వప్నం తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం రావాలని, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలన్నదే నా ఆకాంక్ష అన్నారు సోనియా గాంధీ. మీరంతా సపోర్టుగా నిలుస్తారా? అని ప్రశ్నించగా సభికుల నుంచి పెత్త ఎత్తున నినాదాలు రావడంతో సోనియా తన ప్రసంగాన్ని జైహింద్​, జై తెలంగాణ అంటూ ముగించారు. కాగా, సోనియా గాంధీ హిందీ ప్రసంగానికి కాంగ్రెస్​ నేత ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలుగు అనువాదం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement