Sunday, April 28, 2024

చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ఆల‌యాన్ని సంద‌ర్శించ‌నున్న సీఎం యోగి-భారీ ఏర్పాట్లు

ఆదివారం హైద‌రాబాద్ చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ఆల‌యాన్ని సంద‌ర్శించ‌నున్నారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్. యోగి ఆదిత్యనాథ్ రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. ఉదయం యోగి అమ్మవారిని దర్శించుకుంటారని.. ఆయన పర్యటన కోసం పాతబస్తీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇక, పలువురు బీజేపీ ముఖ్యనేతలు కూడా ఈ రెండు రోజుల్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేడు, రేపు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు.. ఇలా దాదాపు 350 మంది పాల్గొననున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement