Saturday, May 18, 2024

మంత్రి మేకపాటి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేగ, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని హత్తుకుని ఓదార్చారు. రేపు ఉదయం 6 గంటలకు మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహం నెల్లూరు చేరుకోనుంది. రేపు సాయంత్రం వరకు నెల్లూరులోని ఆయన నివాసంలో సందర్శన కోసం ఏర్పాటు చేస్తున్నారు.  గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికా నుండి రేపు మధ్యాహ్నం నెల్లూరుకి రానున్నారు. బుధవారం ఉదయం స్వగ్రామమైన మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు.

మరోవైపు బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం జరగబోయే మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణాపురం జవహర్ నవోదయ కళాశాలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏర్పాట్లను అధికార యంత్రాంగం పరిశీలించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement