Friday, April 26, 2024

హైద‌రాబాద్ లో చేగువేరా కుమారై.. ఘ‌న‌స్వాగ‌తం ప‌లుకుతూ భారీ ప్లెక్సీలు

కోల్ క‌తా నుంచి శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు క్యూబా విప్ల‌వ యోధుడు చేగువేరా కుమారై డాక్ట‌ర్ అలైదా గువేరా.
ఆమెతో పాటు చేగువేరా మనుమరాలు, ప్రొఫెసర్ ఎస్తేఫానియా గువేరా కూడా వచ్చారు. వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా, ఎస్తేఫానియా ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ సభలో బీజేపీ, ఎంఐఎం తప్ప మిగతా పార్టీలకు చెందిన నేతలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సభను విజయవంతం చేయాలని క్యూబా తెలంగాణ కమిటీ కో ఆర్డినేటర్లు పిలుపునిచ్చారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా అలైదా, ఎస్తెఫానియా సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దుంభవన్ కు వెళ్లనున్నట్లు తెలిసింది. సభ జరిగే రవీంద్రభారతి వద్ద చేగువేరా, ఆయన కూతురు, మనవరాలికి స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement