Wednesday, May 1, 2024

Power Crisis: విద్యుత్ సంక్షోభంపై కేంద్రం చర్చ

దేశంలో బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం సోమవారం రాష్ట్రాలతో సమావేశం కానుంది. పవర్ ప్లాంట్ల పునరుద్ధరణ దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. విద్యుత్ సంక్షోభంపై ఢిల్లీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందంటున్న కేంద్రం విమర్శించింది. ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ శుక్రవారం నాడు కొన్ని పవర్ ప్లాంట్‌లలో కేవలం ఒక రోజు మాత్రమే స్టాక్‌లు ఉన్నాయని పేర్కొంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీ విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుందని, ఆసుపత్రుల వంటి అవసరమైన సేవలకు విద్యుత్ సరఫరా కూడా ప్రమాదంలో ఉందని ఢిల్లీ మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement